న్యూస్ డెస్క్,(స్వతంత్ర ప్రభ)
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి బిల్లును ఆమోదించినందుకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి,నారా లోకేష్ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కిప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. సోమవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతిని కలిసిన నారా లోకేష్ తోకలిసినెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిఇతరఎంపీలు పాల్గొని రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కోట్ల ప్రజల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయడం తమకు దక్కిన ఒక గొప్ప అవకాశంగా అభివర్ణించారు. రాజధానిపై ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న స్పష్టతను తీసుకురావడంలో రైతుల అసాధారణ పట్టుదల, త్యాగాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని కొనియాడారు.