వరంగల్, హనుమకొండ జిల్లా మార్చ్ 3(స్వతంత్ర ప్రభ)
వరంగల్, హనుమకొండ జిల్లా గిరిజన భవన్ లో బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వి ఎన్ నాయక్ అక్షర సవాల్ సీఈవో బాలాజీ నాయక్, వాంకుడోత్ వీరన్న నాయక్, మాజీ జెడ్పిటిసి వీరమ్మ గోపి సింగ్ అర్పిత లక్ష్మణ్ నాయక్,లంబాడీల ఐక్యవేదిక లైవ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు లావుడియా పల్లవి రాజు నాయక్, మూడు రమేష్, సీనియర్ జర్నలిస్ట్ భూక్య శ్రవణ్ కుమార్, రామచంద్రనాయక్, బద్రు నాయక్, యాకూబ్ నాయక్, వీరు నాయక్, అర్చన,సోనీ, అనసూయ బబాయి, విజయ, సారయ్య నాయక్, బాలు, హేమా నాయక్ ,మొదలైన ముఖ్య నాయకులు హోలీ సంబరాలు కలర్ ఫుల్ గా విజయవంతంగా ఆటపాటలతో నిర్వహించడం జరిగింది.వసంతకాల ఆరంభాన్ని, చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచించే ఈ రంగుల పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త ఆశలు, కొత్త రంగులు నింపాలని కోరుకుంటూ.హోలీ అనేది ఐక్యత, ప్రేమ, సోదరభావానికి ప్రతీక అని ఆయన అన్నారు. అందరూ కలిసికట్టుగా ఆనందంతో పండుగను జరుపుకోవాలని. మనసారా కోరుకుంటూ.ప్రేమ, దయ, కరుణ విలువలను పెంపొందిస్తూ సమాజాన్ని మరింత సామరస్యపూర్వకంగా మార్చాలని అని అన్నారు.ఇతరులకు లేదా పర్యావరణానికి హాని కలిగించే చర్యలను పూర్తిగా నివారించాలని, సురక్షితంగా మరియు బాధ్యతాయుతంగా వేడుకలు జరుపుకున్నామని బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వి ఎన్ నాయక్ అందర్నీ దృష్టిలో పెట్టుకొని కలర్ కలర్ఫుల్ హోలీ పండుగ బంజారా సోదరీ సోదరులతో విజయవంతంగా నిర్వహించుకోవడం జరిగింది . సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్న బంజారా వెల్ఫేర్ కమిటీ సభ్యులు