ఆరకు ,ఏప్రిల్:28(స్వతంత్ర ప్రభ)
అల్లూరి జిల్లా అరకు వేలి మండలం నందివలస అంగన్వాడీ కేంద్రం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ మెంబర్ కిల్లో సాయిరామ్ అకస్మిక తనిఖీ నిర్వహించడం జరిగింది. ఈ తనిఖీ లో బాగంగా అంగన్వాడీ లో ఉన్న మెనూ ప్రకారం సరిగా అందుతుందా లేదా పిల్లలకు అందిస్తున్నా పౌష్టికాహారం అందుతుందా లేదా అని అడిగి తెలుసుకోవడం జరిగింది. పిల్లలకు పౌష్టిక ఆహారం అందించే విషయంలో ఎలాంటి పొరపాటు జరగకుండా చూడాలి అని తెలియపరచడం జరిగింది. ఈ విషయంలో ఎలాంటి పొరపాటు జరిగినా సివియర్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది చెప్పడం జరిగింది.