విశాఖ తూర్పు,.(స్వతంత్ర ప్రభ)
వి ఎం ఆర్ డి ఎ అదనపు కమిషనర్ గా దాట్ల కీర్తి శుక్రవారం భాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా కీర్తి ని వి ఎం ఆర్ డి ఎ అదనపు కమిషనర్ గా ప్రభుత్వం నియమించింది. దీంతో ఆమె శుక్రవారం మెట్రోపాలిటన్ కమిషనర్ ఎన్.తేజ్ భరత్ ఐ.ఏ.ఎస్ ని మర్యాద పూర్వకంగా కలిసిన తదుపరి బాధ్యతలు చేపట్టారు. కీర్తి గతంలో వి ఎం ఆర్ డి ఎ కార్యదర్శిగా పని చేశారు. అదనపు కమిషనర్ గా విధుల్లో చేరిన ఈమెకు పలువురు ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు.