అల్లూరి జిల్లా అరకులోయ,(స్వతంత్ర ప్రభ)

అరకులోయ లో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు అరకు ఇంఛార్జ్ సియ్యారి దొన్నుదొర పార్టీ జెండా ఆవిష్కరించి, అనంతరం పార్టీ దివంగత నేత ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొందని, పేదవాడి ఆకలి తీర్చడమే ధ్యేయంగా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని, నేటికీ అదే స్ఫూర్తితో పార్టీ ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.