

మధురవాడ (స్వతంత్ర ప్రభ)
వజ్రాలు మరియు బంగారం ఆభరణాలు వ్యాపార రంగంలో దిన దిన అభివృద్ధి చెందుతున్న నా మిత్రులు రాంబాబు గారు మధురవాడలో కిస్నా డైమండ్స్ అండ్ జ్యువలరీ షోరూం ప్రారంభించడం తనకు ఎంతో ఆనందదాయకంగా ఉందని వసంత విహార్ గ్రూప్. అధినేత ప్రకాష్ అన్నారు. శనివారం ఉదయం మధురవాడ మిధిలాపురి వుడా కాలనీ లో కిస్నా డైమండ్స్ అండ్ జ్యువలరీ విశాఖపట్నం మూడవ బ్రాంచ్ ను ఆ సంస్థ అధినేత కొత్తపల్లి రాంబాబు. పుష్పలత దంపతులు ఆధ్వర్యంలో వసంత విహార్ గ్రూప్ అధినేత ప్రకాష్ గారు జ్యోతి ప్రజ్వలన చేసి.. షో రూమ్ కి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కిస్నా డైమండ్స్ షోరూం ను స్థానిక ప్రజలు ఆదరించి ప్రోత్సహించాలని ఆయన కోరారు… కిస్నా డైమండ్స్ అండ్ జ్యువెలరీ అధినేత కొత్తపల్లి రాంబాబు మాట్లాడుతూ. ఈ షోరూం ప్రారంభోత్సవానికి వచ్చిన వసంత్ విహార్ అధినేత ప్రకాష్ గారికి.. వాళ్ళ అబ్బాయి వసంత గారికి కస్టమర్లకు బంధుమిత్రులకు ఆయన ముందుగా కృతజ్ఞతలు తెలిపారు.అదేవిధంగా తమ షోరూమ్. మొదటిది గాజువాక లోను.. రెండవది విశాఖపట్నం సంపత్ వినాయక టెంపుల్ వద్ద. మిధులపురి వుడా కాలనీలో ఇది మూడో షో రూమ్ అని. కస్టమర్లు ఆదరించడం వల్లే ఈ షో రూములు మంచిగా నడుస్తున్నాయని.. ఈ కొత్తగా ప్రారంభించిన షోరూం కూడా దినదిన అభివృద్ధి చెందడానికి మీ అందరూ సహాయ సహకారాలు కావాలని ఆయన కోరారు… అన్ని రకాల వజ్రాభరణాలు కాలానికి అనుగుణంగా తమ షోరూమ్ లో అందుబాటులో ఉన్నాయని ఆయన తెలియజేశారు… ఈ కార్యక్రమంలో విశాఖపట్నం కిస్నా డైమండ్స్ అండ్ జువెలరీ నిర్వాహకులు కే.రాంబాబు,కే.లక్ష్మణరావు, కే.భీమారావు,కే.దామోదర్ రావు దంపతులు.. కిస్నా జువెలరీ కస్టమర్లు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
