ఆల్ ఇండియా పోర్ట్ ట్రస్ట్ వర్కర్స్ ఫెడరేషన్  అధ్యర్యంలో ఘనంగా స్నేహహస్తం రచ్చ బండ కార్యక్రమం

న్యూస్ డెస్క్, (స్వతంత్ర ప్రభ)

మత్స్యకారులు సమస్యలు పరిష్కారించి వారికి చేయూత్తానియడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారులు నివాసించే గ్రామాలలో స్నేహ హస్తం రచ్చ బండ కార్యక్రమాన్ని మత్స్యకార సంఘ సభ్యుడు వల్లభనేని వెంకటేశ్వరరావు అధ్యక్షుతన ఆల్ ఇండియా పోర్ట్ ట్రాస్ట్ వర్కర్స్ ఫెడరేషన్  బోర్డు ఏపి ఛైర్మన్ షేక్ ఖలీఫా తుల్లా బాషా  ముఖ్య అతిధిగా పాల్గోని తోలి స్నేహ హస్తం రచ్చ బండ కార్యక్రమాన్ని ప్రారంభించిన్నారు.ఈ కార్యక్రమం లో పెద్ద ఏతున్న మత్స్యకారులు ముఖ్యం గా మహిళాలు పాల్గోని వారి సమస్యలను తెలియజేశారు.ఈ సందర్బంగా ఆల్ ఇండియా పోర్ట్ ట్రాస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ బోర్డు ఏపి ఛైర్మన్ షేక్ ఖలీఫా తుల్లా బాషా కార్యక్రమన్ని ఉద్దేసించి మాట్లాడుతూ మత్స్యక సోదరులు అనేక సమస్యలతో శతమాతమౌతున్న సందర్భాలలో 
వారి సమస్యలు పరిష్కారమార్గం కోసం  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు ఎన్.డి.ఏ కూటమిలో భాగమై ఉన్నాందున ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమిష్టిగా ప్రజాభ్యునాతికి దేశఅభిరుద్ధికి కృషి చేస్తున్నారని మత్స్యకారుల సంక్షేమo కోసం అనేక పథకాలు ఇస్తున్నారన్నారు. వేట నిషేధo ఉన్నందున రాష్ట్రo లో 1,30,796 మత్స్యకార కుటుంబాలకు  వారి జీవనోపాధి కి  నేరుగా వారి ఖాతాలో 20 వేల రూపాయలు 261,59 కోట్లు ఇవ్వడం జరిగిందన్నారు. 72 కోట్లతో  కాకినాడ పోర్ట్ ఆధునికిరణ,  ఏపి మత్స్యకారులకు 200 ఆధునిక బోట్లు,  ఏపి లో నేషనల్ ఫిష్ డెవలప్మెంట్ బోర్డు ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు, సీ -ఫుడ్ రావణకు  ఏపి ఎయిర్ ఫ్లాట్ స్టేషన్లు, మరియు  ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గం లోని కొత్తపట్నం  లో షిపింగ్ హార్బర్ ప్రాజెక్టు ను నిర్మాణం కోసం 441 కోట్ల రూపాయలు మంజూరు చేయడం అనేక మంది ఉపాధి అవకాశాలు కలుగుతాయ్యన్నారు. మత్స్యకారు సోదరులు తమ  బోట్లకు  ఇన్సూరెన్స్ చేయుంచుకోవాలని  ఇన్సూరెన్స్ లేకపోతే  ఏదైనా ప్రమాదం జరిగితే పూర్తి స్థాయి లో  నష్టాల కు  గురై కుటుంబాలు  విధిన పడ్తాయి అన్నారు. మన  వల్లభనేని వెంకటేశ్వర రావు  తన  సుమారు 50 లక్షల బోటు  ప్రమాదంలో  పూర్తిగా కాళీ  ఇన్సూరెన్స్ లేనందున  నష్టపోయాడని  అన్నారు. వల్లభనేని వెంకటేశ్వర రావు కు  ప్రభుత్వ పరంగా  బోటు పూర్తి మార్మతులు చేయించడానికి కృషి  చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం విశ్వనాధపల్లి వెంకటేశ్వరరావు(బాబు) ఆంధ్ర ప్రదేశ్ అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్, మరియు  ఏ.ఐ.పి.టి.డబ్ల్యూఎఫ్ ఏపి సభ్యుడు పిన్ని సాంబాశివరావు,నిజాంపట్నం పోర్ట్ ఇంచార్జీ షేక్ బాజీ షరీఫ్, బందర్ పోర్ట్ ఇంచార్జీ శ్రీ.  నడికుడిటి సురేష్ బాబు , ఏ.ఐ.పి.టి.డబ్ల్యూఎఫ్ ఛైర్మన్  పర్సనల్ సెక్రటరీ  షేక్ బాచి. పెను మూడి గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *