విశాఖపట్నం, జూలై 17 (స్వతంత్ర ప్రభ):
మహారాణిపేట పోలీస్ స్టేషన్ నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ)గా బాధ్యతలు చేపట్టిన జి. గోవిందరావును శుక్రవారం బీజేపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.డీవీఎంసీ మానిటరింగ్ కమిటీ ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ సభ్యులు చొక్కాకుల రాంబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు అత్తిలి శంకర్రావు, మహారాణిపేట మండల అధ్యక్షులు దేవర చంద్రశేఖరరావు, పెందుర్తి రాజు, చెల్లుబోయిన సందీప్, దశమంతల స్వామి జగదీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నూతన సీఐ గోవిందరావుకు నాయకులు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు ఆయన సమర్థవంతంగా సేవలందించాలని ఆకాంక్షించారు.





