విశాఖ దక్షిణం, (స్వతంత్ర ప్రభ)
గడప గడపకు రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యం! కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు విశాఖ దక్షిణ నియోజకవర్గం పార్టీ ఇంచార్జ్ సీతంరాజు సుధాకర్ పర్యవేక్షణలో నేడు ఉదయం 39 వ వార్డులోని బూత్ నెంబర్ 100లో ప్రారంభమై… ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరిని ఆప్యాయతగా పలకరించి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను కరపత్రం రూపంలో అందజేసి వారి యొక్క సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని తెలియజేసి వారితో ఫోటోను తీసుకొని మై టిడిపి యాప్ లో అప్లోడ్ చేయడం జరిగినది, ఈ కార్యక్రమంలో వార్డు క్లస్టర్ ఇంచార్జ్ వాసుపల్లి దానేష్, అధ్యక్షులు మైలిపిల్లి శ్రీను, పార్లమెంటు ఉపాధ్యక్షులు అబ్దుల్ అనీఫ్, బూత్ 100 అధ్యక్షులు తిత్తి సాయి బలరాం, యూనిట్ ఇన్చార్జిలు, వివిధ బూతు కన్వీనర్లు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు





