Connect with us

Hi, what are you looking for?

Gvmc

ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం వద్దు

జోనల్ కమిషనర్ ఎం.మల్లయ్య నాయుడు

విశాఖ దక్షిణం, (స్వతంత్ర ప్రభ )

దక్షిణ జోన్ జోనల్ కమిషనర్ ఎం.మల్లయ్య నాయుడు ఆధ్వర్యంలో దక్షిణ జోన్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రజల నుండి వివిధ సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులను నేరుగా స్వీకరించిన జోనల్ కమిషనర్, వాటిని సత్వరమే పరిశీలించి ప్రజలకు త్వరితగతిన పరిష్కారం అందించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకుండా, ప్రతి ఫిర్యాదును నిర్దేశిత గడువులో పరిష్కరించి, తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మొత్తం 5 ఫిర్యాదులు స్వీకరించగా, వాటిలో టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించిన -2 ఫిర్యాదులు మరియు రెవెన్యూ -2, వాటర్ సప్లై సంబంధించిన 1 ఫిర్యాదులు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కృష్ణంరాజు, టౌన్ ప్లానింగ్, ఎలక్ట్రికల్, వాటర్ సప్లై విభాగాల అధికారులు మరియు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.,

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You May Also Like

AP NEWS

తెలంగాణలో పార్టీ బలోపేతానికి జనసేన వేగంగా అడుగులు వేస్తోందని,ప్రజా సమస్యలపై నిరంతర పోరాటంతో పాటు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పోరాటాల గడ్డగా పేరొందిన...

AP NEWS

ఫుడ్ స్ట్రీట్‌లో ప్రజల మధ్య అల్పాహారం స్వీకరించిన కేంద్ర సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తాడేపల్లిగూడెం, జూలై:16(స్వతంత్ర ప్రభ) త్వరలో భీమవరం పాలకొల్లులలో ఈట్ స్ట్రీట్ లను ఏర్పాటు చేయటానికి కృషి చేస్తాను...

BJP

విశాఖపట్నం, జూలై 17 (స్వతంత్ర ప్రభ): మహారాణిపేట పోలీస్ స్టేషన్ నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ)గా బాధ్యతలు చేపట్టిన జి. గోవిందరావును శుక్రవారం బీజేపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు...

AP NEWS

కౌన్సిలింగ్‌తో మనోధైర్యం నింపిన పోలీసులు విశాఖ దక్షిణం,(స్వతంత్ర ప్రభ) ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగ సమస్యలతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు ప్రయత్నించబోయిన ఓ యువకుడిని వన్‌టౌన్ పోలీసులు సకాలంలో స్పందించి కాపాడారు. వన్‌టౌన్...