పాడేరు,(స్వతంత్ర ప్రభ)
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, నారా లోకేష్, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ప్రతి మూడవ బుధవారం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించాలని సూచనల మేరకు ఈనెల 22వ తేదీన పాడేరు లోని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి గిడ్డి ఈశ్వరి ఆదేశాల మేరకు జరిగే ఈ సమావేశానికి నియోజకవర్గంలో ఉన్న రాష్ట్రస్థాయిలో వివిధ నామినేటెడ్ పదవుల్లో ఉన్న చైర్మన్లు, డైరెక్టర్లు, నియోజకవర్గ పరిధిలో ఉన్న వివిధ విభాగాల్లో పనిచేస్తున్న నాయకులు, మండల అధ్యక్షులు, క్లస్టర్ ఇన్చార్జిలు, యూనిట్ ఇన్చార్జిలు, బూత్ ఇన్చార్జిలు, గ్రామ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు, ప్రతి ఒక్కరూ ఈ సమావేశానికి హాజరై విజయవంతం చేయాలని కోరుతున్నాం.





