

విశాఖపట్నం, (స్వతంత్ర ప్రభ):
జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ (జాప్) విశాఖ జిల్లా అధ్యక్షుడు, కోస్టల్ జర్నలిస్ట్ ఎడిటర్ ఎం. కీర్తన్ జన్మదిన వేడుకలు బుధవారం రామకృష్ణ బీచ్లో ఘనంగా నిర్వహించారు. జాప్ జిల్లా కార్యదర్శి జె.వి.కె. అప్పలరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జాప్ సభ్యులు కేక్ కట్ చేసి కీర్తన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఎం. కీర్తన్ మాట్లాడుతూ తన జన్మదినాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తానని, వారికి ఎలాంటి సహాయం అవసరమైనా తాను అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు.జాప్ జిల్లా కార్యదర్శి జె.వి.కె. అప్పలరాజు మాట్లాడుతూ ఎం. కీర్తన్ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని, జర్నలిజం రంగంలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పృథ్వీరాజు, వడ్డాది ఉదయ్ కుమార్, అర్జున్, సురేష్, సతీష్ తదితర జాప్ సభ్యులు పాల్గొని కీర్తన్కు శుభాకాంక్షలు తెలియజేశారు.





