విశాఖ దక్షిణం, (స్వతంత్ర ప్రభ)
దక్షిణ నియోజకవర్గం 31వ వార్డులో కొలువుదీరిన శ్రీ శ్రీ మరిడిమాంబ అమ్మవారి ఆలయ జాతర సందర్భంగా నిర్వహించనున్న అన్నదాన ప్రసాదానికి మాజీ ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ రూ.10వేలు విరాళం అందజేశారు. కనకల వీధి కి చెందిన ఈ ఆలయ కమిటీ సభ్యులకు 31 వైసీపీ అధ్యక్షుడు బాపు ఆనంద్ సమక్షంలో బుధవారం ఆసీలమెట్ల కార్యాలయంలో పదివేల రూపాయల నగదును వారికి అందజేశారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ అధికారంలో ఉన్న లేకున్నా సేవా కార్యక్రమాలు చేసినందుకు తాను ఎప్పుడూ ముందుంటానన్నారు. ప్రతి ఏడాది నిర్వహించే ఈ మరిడి మాంబ అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా జరగాలని వాసుపల్లి గణేష్ కుమార్ ఆకాంక్షించారు. అన్నదాన కార్యక్రమంలో ఎంతోమంది అమ్మవారి ప్రసాదంతో కడుపు నింపుకునేవారు వందలాదిమంది ఉంటారన్నారు. అటువంటి పేదలకు కూడా న్యాయం చేసే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజలతోపాటు ఆంధ్ర రాష్ట్రానికి మేలు జరుగుతుందన్నారు. అమ్మవారి కరుణాకటాక్షం జగనన్న కుటుంబం పై చల్లగా ఉండాలని వాసుపల్లి గణేష్ కుమార్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పల్ల శ్రీను, పిలక మోహన్ ( డిస్ట్రిక్ట్ స్టూడెంట్ వింగ్ జనరల్ సెక్రటరీ ), దినేష్ ( వార్డ్ స్టూడెంట్ వింగ్ ప్రెసిడెంట్స్ ),కమిటీ సభ్యులు అప్పారావు, నాయుడు, మహేష్ వైసీపీ నాయకులు పాల్గొన్నారు.





