ఆచూకీ తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి
విశాఖపట్నం (స్వతంత్ర ప్రభ):
కింగ్ జార్జ్ హాస్పిటల్ (కేజీహెచ్)లో చికిత్స పొందుతూ గుర్తు తెలియని సుమారు 40 సంవత్సరాల వయస్సు గల మహిళ మృతి చెందినట్లు వన్టౌన్ పోలీసులు తెలిపారు.
సదరు మహిళ ఆస్పత్రిలో చికిత్స కోసం చేరి చికిత్స పొందుతున్న సమయంలో మృతి చెందిందని వెల్లడించారు. మృతురాలి వివరాలు ఇప్పటివరకు తెలియరాలేదని, ఆమెను ఎవరైనా గుర్తిస్తే లేదా ఆమెకు సంబంధించిన సమాచారం తెలిసిన వారు వెంటనే వన్టౌన్ పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.సమాచారం అందించాల్సిన ఫోన్ నంబర్లు:వన్టౌన్ పోలీస్ స్టేషన్: 0891-2563632,
వన్టౌన్ సీఐ: 9440796019, స్టేషన్ రైటర్: 8019642838





