విశాఖ దక్షిణం ,(స్వతంత్ర ప్రభ)
దక్షిణ నియోజకవర్గంలోని ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారం కోరుతూ 39వ వార్డు పరిధిలోని క్వీన్ మేరీ హై స్కూల్లో శుక్రవారం నిర్వహించిన జిల్లా అధికారుల సమస్యల పరిష్కార సదస్సులో వినతిపత్రాలు సమర్పించారు.ఈ సందర్భంగా విశాఖ పోర్టు అథారిటీ పరిధిలో ఏర్పడుతున్న కాలుష్యాన్ని నివారించేలా చర్యలు చేపట్టాలని, గత పదేళ్లుగా ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు టిడ్కో గృహాలను తక్షణమే కేటాయించాలని, దక్షిణ నియోజకవర్గంలో రైతు బజార్ను ఏర్పాటు చేయాలని తదితర ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ప్రజల సమస్యలను పరిశీలించి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ 39వ వార్డు అధ్యక్షులు మైలిపిల్లి శ్రీను, పార్లమెంట్ ఉపాధ్యక్షులు అబ్దుల్ అనీఫ్, బూత్ అధ్యక్షులు తిత్తి సాయి బలరాం తదితరులు పాల్గొన్నారు.





