ఏ ఎస్ ఆర్ జిల్లా,(స్వతంత్ర ప్రభ)
అల్లూరి జిల్లాలో మన ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచడం, విద్యార్థుల వికాసం అందించడం, మౌలిక వసతులను మెరుగుపరచడమే లక్ష్యంగా తల్లిదండ్రులు,ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ నిషాంతి. టి తెలిపారు. శుక్రవారం ఉదయం తలరీ సింగి పాఠశాల ఆవరణలో జరిగిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాన్ని జ్యోతి ప్రజ్వలన గావించి ఘనంగా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలల నిర్వహణలో తల్లిదండ్రుల భాగస్వామ్యం, పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల విద్యా ప్రగతి కేవలం ఉపాధ్యాయుల బాధ్యత మాత్రమే కాదని, తల్లిదండ్రులు కూడా విధిగా హాజరై తమ పిల్లల చదువు, హాజరు,ప్రవర్తనపై నిరంతరం ఉపాధ్యాయులు పిల్లలతో సమీక్షించాలని కలెక్టర్ తెలిపారు… ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు పాఠశాలల్లో అందిస్తున్న ఉచిత విద్య, డిజిటల్ బోధన, మౌలిక సదుపాయాలను విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకునేలా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆదేశించారు..,.





