

విశాఖ దక్షిణం,(స్వతంత్ర ప్రభ)
31 వార్డు పరిధిలో శ్రీశ్రీశ్రీ మరిడిమాంబ అమ్మవారి పండగ మహోత్సవంలో భాగంగా సరస్వతి పార్క్ వద్ద ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమంలో విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొన్నారు.అమ్మవారి పండగ సందర్భంగా నిర్వహించిన వివిధ క్రీడా పోటీల్లో విజేతలకు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ సీపీ బహుమతులు అందజేసి అభినందించారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ మరిడిమాంబ అమ్మవారి పండగ మహోత్సవం మరింత ఘనంగా నిర్వహించేందుకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.





