విశాఖ దక్షిణం, (స్వతంత్ర ప్రభ)
విశాఖ దక్షిణ నియోజకవర్గం 39వ వార్డు తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఈనెల 27వ తేదీ నుండి ఇంటింటికి తెలుగుదేశం ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా సమావేశంలో చర్చించడం జరిగింది. ఈ సమావేశంలో వార్డ్ క్లస్టర్ ఇంచార్జ్ వాసుపల్లి దానేష్ వార్డు అధ్యక్షులు మైలిపిల్లి శ్రీను తో పాటుగా యూనిట్ ఇన్చార్జిలు బూతు కన్వీనర్లు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు





