Connect with us

Hi, what are you looking for?

Andhrapradesh

ఘనంగా శ్రీ శ్రీ జగన్నాథ స్వామి వారి తిరుగు రథయాత్ర మహోత్సవం

రథయాత్రను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్

విశాఖ దక్షిణం,(స్వతంత్ర ప్రభ)

శ్రీ శ్రీ జగన్నాథ స్వామి వారి తిరుగు రథయాత్ర మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ కార్యక్రమంలో పాల్గొని కొబ్బరికాయ కొట్టి రథయాత్రను ప్రారంభించారు.అనంతరం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి రథాన్ని భక్తులతో కలిసి లాగారు. చౌట్రీ నుంచి ప్రారంభమైన తిరుగు రథయాత్ర భక్తుల కోలాహలం, ఆధ్యాత్మిక వాతావరణం నడుమ జగన్నాథ స్వామి ఆలయం వరకు సాగింది. స్వామివారి దర్శనం కోసం, రథయాత్రలో పాల్గొనేందుకు అశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ, శ్రీ జగన్నాథ స్వామివారి తిరుగు రథయాత్ర మహోత్సవాలను అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించిన నిర్వాహకులకు, భక్తులకు మరియు సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.శ్రీ జగన్నాథ స్వామివారి కృపా కరుణాకటాక్షాలతో దక్షిణ నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. స్వామివారి ఆశీస్సులతో దక్షిణ నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. ఈ మహోత్సవంలో  ఆలయ ఈవో, ఆలయ కమిటీ చైర్మన్ ,సభ్యులు, కూటమి శ్రీనులు ,భక్తులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You May Also Like

AP NEWS

తెలంగాణలో పార్టీ బలోపేతానికి జనసేన వేగంగా అడుగులు వేస్తోందని,ప్రజా సమస్యలపై నిరంతర పోరాటంతో పాటు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పోరాటాల గడ్డగా పేరొందిన...

AP NEWS

ఫుడ్ స్ట్రీట్‌లో ప్రజల మధ్య అల్పాహారం స్వీకరించిన కేంద్ర సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తాడేపల్లిగూడెం, జూలై:16(స్వతంత్ర ప్రభ) త్వరలో భీమవరం పాలకొల్లులలో ఈట్ స్ట్రీట్ లను ఏర్పాటు చేయటానికి కృషి చేస్తాను...

BJP

విశాఖపట్నం, జూలై 17 (స్వతంత్ర ప్రభ): మహారాణిపేట పోలీస్ స్టేషన్ నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ)గా బాధ్యతలు చేపట్టిన జి. గోవిందరావును శుక్రవారం బీజేపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు...

AP NEWS

కౌన్సిలింగ్‌తో మనోధైర్యం నింపిన పోలీసులు విశాఖ దక్షిణం,(స్వతంత్ర ప్రభ) ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగ సమస్యలతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు ప్రయత్నించబోయిన ఓ యువకుడిని వన్‌టౌన్ పోలీసులు సకాలంలో స్పందించి కాపాడారు. వన్‌టౌన్...