స్టీల్ ప్లాంట్ ఉద్యోగి పట్టా రమణ పదవీ విరమణను సేవా దినోత్సవంగా మార్చిన పట్టా కుటుంబం
గాజువాక,(స్వతంత్ర ప్రభ)
పదవి విరమణ వేడుకలా కాకుండా, సేవే గొప్పదనం అనేట్లు ఇచ్చా ఫౌండేషన్ అనాధ, వికలాంగా పిల్లలతో గడిపి నేటి సమాజానికి ఆదర్శంగా నిలిచిన పట్టా రమణ&రత్న కుమారి దంపతులు.85వార్డు లో నివాసం ఉంటుంన్న పట్టా రమణ ఎస్ ఎం ఎస్ -1సీసీ డి విభాగం లో పదవి విరమణ కార్యక్రమం నేటి సమాజానికి ఆదర్శంగా నిలిచింది.ఇచ్ఛఫౌండేషన (కొండాకరలు ప్రాంతం) లో పదవీ విరమణ కార్యక్రమంను చేపట్టిన పట్టారమణ&రత్న కుమారి దంపతులు , అనాధ, వికలాంగ బాలబాలికల మధ్య ఒకరోజు మొత్తం గడిపి,ఆహారం డొనేట్ చేసి వారి బాగోగులు తెలుసుకుని వారి ఆనందాన్ని,బాధలను పంచుకుని గొప్ప మానవత్వాన్ని చాటి, రానున్న రోజుల్లో మా తొడ్పాటు వికలాంగా పిల్లలకు ఉంటుందని చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమంలో వారి సతీమణి పట్టా పైడి రత్నం జనసేన వీర మహిళ, పెద్ద అల్లుడు కనకరాజు& సుధారాణి, పిల్లలుపూజిత, హేమచంద్ర,చిన్న అల్లుడు జి.వి.వి ప్రసాద్&సౌజన్య రాజి,పిల్లలు వర్షిణి&జస్వంత్ కుటుంబ సమేతంగా ఇచ్చ ఫౌండేషన్ వికలాంగ కుటుంబాలతో ఒకరోజు నడిపి హౌనాట్యన్ని చాటి చెప్పారు.పట్టా రమణ &పట్టా రత్నా కుమారి దంపతులు నేటి తరానికి ఆదర్శంగా నిలిచారు. స్వతహాగా జనసేన వీర మహిళగా అగనంపూడి ప్రాంతంలో పేద కుటుంబాలకు తనవంతు సహాయం చేస్తూ పార్టీలకు అతితంంగా ఉంటున్నా ఫ్యామిలీ పట్టా ఫ్యామిలీ, పదవి విరమణ తర్వాత తన కష్టకాలంలో తోడ్పడిన ఫ్యామిలీకి అంకితం తన మిగిలిన జీవిత కాలం అని ఈ సందర్భంగా పట్టా రమణ చెప్పడం జరిగింది.ఈ సందర్బంగా సేవా దృక్పధంకు ఇచ్చా ఫౌండేషన్ శాలువా తో చిరు సన్మానం చేసారు.సేవా దృక్పధంతో ముందుకు సాగుతున్న పట్టా రమణ &రత్న కుమారి ఫ్యామిలీ నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారని కార్యక్రమానికి హాజరైన పెద్దలు కొనియాడారు.





